Wednesday, May 1, 2024

ఆగిఉన్న వాహ‌నాల‌ను ఢీకొట్టిన టిప్ప‌ర్‌.. ఒక‌రు మృతి..

టిప్ప‌ర్ ఢీకొని ఒక‌రు మృతి… ప‌లువురికి గాయాలైన ఘ‌ట‌న హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని వేగంగా దూసుకొచ్చిన టిప్పర్‌ సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న కార్లు, బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఒకరు మృతి చెంద‌గా.. ఐదుగురికి గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. అనంత‌రం క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుడిని స్విగ్గీ డెలివరీ బాయ్‌ నసీర్‌గా గుర్తించారు. టిప్పర్‌ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement