Monday, July 22, 2024

TS | శంషాబాద్‌కు బెదిరింపు మెయిల్స్‌…నిందితుడు అరెస్ట్‌ !

హైదరాబాద్‌ : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రెండు పర్యాయాలు బెదిరింపు మెయిల్స్‌ పంపిన నిందితుడిని సోమవారం నాడు ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈక్రమంలో బెదిరింపు మెయిల్స్‌పై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని బెంగళూరుకు చెందిన వైభవ్‌ తివారీగా పోలీసులు గుర్తించారు. విమానాల్లో హైజాకర్లు వచ్చారని గతంలో రెండు సార్లు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు మెయిల్స్‌ పంపాడు నిందితుడు. ఆ మెయిల్స్‌ కారణంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే మెయిల్స్‌ నకిలీవి అని తేలడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెంగళూరులో వైభవన్‌ను అరెస్టు చేశారు. కరోనా కారణంగా ఐటీ- ఉద్యోగం పోయి డిప్రెషన్‌లో ఈ తరహా మెయిల్స్‌ పంపానని వైభవ్‌ పోలీసుల విచారణలో వెల్లడించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement