Thursday, May 2, 2024

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ‌ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఎగరవేసి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్ శృతిఓజా, సంతోష్ ఈవీడీఎం విశ్వజిత్, ఈఎన్సీ జియావుద్దీన్, హౌసింగ్ ఓ యస్ డీ సురేష్ కుమార్, సీసీపీ దేవేందర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్లు వి కృష్ణ, జయరాజ్ కెనడీ, సరోజ, విజయలక్ష్మి ప్రాజెక్టు ఏఎస్. సీ వెంకటరమణ, సీపీ అర్ ఓ మహమ్మద్ ముర్తుజా, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ్ కుమార్, చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర రెడ్డి, స్పోర్ట్స్ డైరెక్టర్ బాషా, సెక్రెటరీ లక్ష్మి, జాయింట్ కమిషనర్లు కులకర్ణి, సంధ్య, తిప్పర్తి యాదగిరి, ఎలక్ట్రిసిటీ ఎస్సీ శ్రీనివాస్, ఈ ఈ మమత, ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement