Friday, April 26, 2024

తెలుగుదేశానికి మెచ్చా గుడ్ బై…. టి ఆర్ ఎస్ లో టిడిఎల్పీ విలీనం…

హైద‌రాబాద్ – తెలంగాణ అసెంబ్లీలో టిడిపి క‌నుమ‌రుగైంది… గ‌త ఎన్నిక‌ల‌లో టిడిపి నుంచి ఇద్దరు సండ్ర వెంక‌ట వీర‌య్య‌, మెచ్చా నాగేశ్వ‌రరావులు ఎమ్మెల్యేగా గెలుపొందారు.. ఈ ఇద్ద‌రూ ఖ‌మ్మం జిల్లాకు చెందిన వారే.. సండ్ర వీర‌య్య ఇప్ప‌టికే టిఆర్ ఎస్ పార్టీలో కొన‌సాగుతుండ‌గా, తాజాగా అశ్వ‌రావుపేట‌ టిడిపి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ‌రరావు సైతం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.. అంతే కాకుండా సండ్ర వీర‌య్య‌తో క‌ల‌సి నేడు మెచ్చా నాగేశ్వ‌ర‌రావు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస‌రెడ్డిని క‌లిసి టిడిఎల్పీని టిఆర్ ఎస్ లో విలీనం చేస్తున్న‌ట్లు లేఖ అందించారు.. శాస‌న స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డితో కూడ భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వ‌ర‌రావు త‌న నిర్ణ‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు.. దీంతో అసెంబ్లీలో టిడిపికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది…

Advertisement

తాజా వార్తలు

Advertisement