Thursday, April 25, 2024

నిరుపేద పెళ్లికూతురుకు శ్రీనివాస్ గుప్తా చేయూత

నిరుపేద యాదవ కుటుంబానికి చెందిన పెళ్లికూతురు వివాహానికి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పుస్తెమట్టెలు అందజేశారు. ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా వాస్తవ్యులు హైదరాబాద్ రాంనగర్ లో నివాసముంటున్న బీసీ.డీ యాదవ కులానికి చెందిన రోజువారీ వృత్తి చేసే సలాంద్రి పద్మ మనోజ్ ల కూతురు మౌనిక వివాహానికి నాగోల్ లోని తన కార్యాలయంలో పుస్తెమట్టెలు, చీర, గాజులను ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా అందించారు. ఈ కార్యక్రమంలో సందీప్, కల్పన వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement