Saturday, May 4, 2024

ఘనంగా పోచమ్మ అమ్మవారి బోనాలు

డివిజన్ పరిధిలోని ఈస్ట్ బాలాజీహిల్స్ కాలనీ శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ అమ్మవారి ఆలయంలో బోనాలు, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ భూక్య సుమన్ దంపతులు, బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు బొమ్మక్ బాలయ్య, గౌరవ కార్పొరేటర్లు లావణ్య శేఖర్ రెడ్డి, మహేశ్వరి కృపాసాగర్, జనరల్ సెక్రెటరీ మీసాల కృష్ణ, సహకార బ్యాంక్ డైరెక్టర్ జడగా రమేష్, కాలనీ అసోసియేషన్ సభ్యులు, గుడి కమిటీ సభ్యులు, డివిజన్ బిఆర్ఎస్ నాయకులు, కమిటీల సభ్యులు, డివిజన్లోని కాలనీల అసోసియేషన్ సభ్యులు, డివిజన్ కుటుంబ సభ్యులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement