Friday, May 17, 2024

Janasena: 20న జనసేన గూటికి పంచకర్ల రమేశ్‌బాబు

మంగళగిరి: వైకాపా విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పంచకర్ల రమేశ్‌బాబు జనసేన గూటికి చేరనున్నారు. ఇవాళ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను పంచకర్ల రమేశ్‌బాబు కలిశారు. పవన్‌, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తో తాజా రాజకీయ పరిణామాలపై పంచకర్ల చర్చించారు. ఈ నెల 20న పవన్‌ సమక్షంలో జనసేనలో చేరనున్నట్టు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… పార్టీలో ఏ బాధ్యత అప్పగించినా సమర్థంగా నిర్వహిస్తానని పంచకర్ల తెలిపారు. రానున్న ఎన్నికల్లో పంచకర్ల రమేశ్‌బాబు పెందుర్తి అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. పంచకర్ల చేరికతో విశాఖలో జనసేన బలం పుంజుకుంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement