Sunday, April 28, 2024

TS : మధుయాష్కిని ఫోన్‌లో పరామర్శించిన రాహుల్ గాంధీ

ఎల్బీనగర్, ఏప్రిల్ 16 (ప్రభ న్యూస్): మధుయాష్కి గౌడ్ మాతృమూర్తి అనసూయ సోమవారం ఉదయం మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్కాంన గ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ ఇవళ టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్‌ని ఫోన్ ప‌రామ‌ర్శించారు.

తల్లి అనసూయగా ఎలా మరణించారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనసూయ మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. బాధాకరమైన సమయంలో మధు యాష్కి గౌడ్ కుటుంబ సభ్యులు మానసిక ధైర్యంతో ఉండాలని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. వారి పట్ల తన ప్రేమ ఆప్యాయతను సానుభూతిని ప్రకటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement