Sunday, April 28, 2024

AP : నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు మృతి

నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. కావ‌లి గ్రామీణ మండ‌లం గౌర‌వ‌రం స‌మీపంలో ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు వ్య‌క్తులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు వ‌దిలారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. అతి వేగం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని పోలీసులు నిర్ధారించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement