Sunday, April 28, 2024

TS : భారత కీర్తిని విశ్వవాప్తం చేసిన గొప్ప నాయకుడు ప్రధాని మోడీ… ఈటెల రాజేందర్..

ఎల్బీనగర్, మార్చి 31(ప్రభ న్యూస్) భారతదేశాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుపుతున్న నరేంద్ర మోడీ కి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మాజీమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వనస్థలిపురం డివిజన్ లోని ఎఫ్సీఐ కాలనీ లో బీజేపీ డివిజన్ అధ్యక్షులు నూతి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో కమ్మ కుటుంబ ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌నతో పాటు మాజీ రాజ్యసభ సభ్యులు గరికిపాటి మోహన్ రావు, జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కమ్మ కుటుంబ సభ్యులందరికి అండగా ఉంటానని తెలిపారు.వారికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటు కష్టసుఖాలలో భాగస్వామ్యం అవుతానన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం పనామా చౌరస్తాలోని నందమూరి తారక రామారావు విగ్రహానికి పూల మాలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి , కొత్త రవీందర్ గౌడ్ , యలమంచలి భాను ప్రసాద్, వల్లభనేని బలాజీనాథ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement