Friday, May 17, 2024

కానిస్టేబుల్‌పై దాడి కేసులో సీఐపై సస్పెన్షన్‌ వేటు

హైదరాబాద్‌ : వనస్థలిపురం కానిస్టేబుల్‌పై దాడి కేసులో సీఐ రాజు సస్పెన్షన్‌ వేటు పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. సౌత్‌ జోన్‌ కంట్రోల్‌ రూమ్‌లో సీఐగా రాజు పనిచేస్తున్నాడు. ఓ యువతితో కారులో ఉండగా భార్య సీఐ రాజుతో గొడవపడింది. అదే సమయంలో అక్కడ ఉన్న కానిస్టేబుల్‌ గొడవ ఆపేందుకు వెళ్లగా.. సీఐ రాజు ఆ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌ చేతిలోని ఫోన్‌ పగలగొట్టాడు. ఈ మేరకు సీఐ రాజును వనస్థలిపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. పై అధికారులకు ఈ విషయం తెలియడంతో సీఐ రాజుపై సస్పెన్షన్‌ వేటు విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement