Monday, April 29, 2024

Navami శోభాయాత్ర‌కునో ప‌ర్మిష‌న్ – రాజాసింగ్ కు పోలీసులు షాక్

హైదరాబాద్ – బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా ఆకాష్ పురి హనుమాన్ టెంపుల్ నుంచి హనుమాన్ వ్యయామశాల వరకు రాజాసింగ్ నిర్వహించనున్న శోభాయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎలక్షన్ కోడ్ ఉండటంతో అనుమతి ఇవ్వ‌లేదు. కాగా, ప్రతీ ఏడాది ఆకాష్ పురి టెంపుల్ నుంచి రాజాసింగ్ ఈ శోభాయాత్ర నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ.. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

లా అండ్ అర్డ‌ర్ స‌మ‌స్య‌లుంటాయ‌న్న పోలీసులు..

ఈ మార్గాల్లో వెళితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో వారు సూచించిన మార్గాల్లోనే శోభాయాత్ర నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. శోభాయాత్రకు అనుమతివ్వకపోవడంతో పోలీసులపై రాజసింగ్ ఫైరయ్యారు. అనుమతి లేకున్నా కచ్చితంగా శోభాయాత్ర నిర్వహిస్తామని అన్నారు. భారీ సంఖ్యలో రామభక్తులు శోభాయాత్రలో పాల్గొంటారని.. ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే పోలీసులే బాధ్యత వహించాలని రాజాసింగ్ అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement