Friday, April 26, 2024

MLRIT హైదరాబాద్, IDSIDS – ఇన్ఫర్మేషన్ డేటా సిస్టమ్స్‌తో ఎంఓయూ

ఎంఎల్ఆర్ఐటీ (మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) హైదరాబాద్, ఐడీఎస్ఐడీఎస్ – ఇన్ఫర్మేషన్ డేటా సిస్టమ్స్‌తో ఒక ఎంఓయూ ( అవగాహన ఒప్పందం) చేసుకొంది. ఇది భారత్ బ్లాక్ చైన్ ప్రాజెక్ట్‌ను అమలు చేయడంలో ఏఐసీటీఈ ఏడు అధీకృత హైపర్‌లెడ్జర్ ట్రైనర్, టెక్నాలజీ పార్టనర్‌లలో ఒకటి..ఈ ఎంఓయూ వల్ల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, స్టూడెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, ప్రాజెక్ట్ మెంటర్‌షిప్, ఇంటర్న్‌షిప్, రీసెర్చ్ అండ్ ప్లేస్‌మెంట్స్‌పై ఎంఎల్ఆర్ఐటీ, ఐడీఎస్ మధ్య సహకారాన్ని ధృవీకరిస్తుంది. ఈ ఎంఓయూ మూడు సంవత్సరాల పాటు ఉంది. డా. కె. శ్రీనివాస్ రావు – ప్రిన్సిపాల్, డాక్టర్ ఇ. అనుప్రియ – హెచ్ఓడీ- సీఎస్ఈ, అరవింద్ వోరుగంటి – వైస్ ప్రెసిడెంట్ – ఐడీఎస్ ఎంఎల్ఆర్ఐటీలో ఎంఓయూపై సంతకం చేశారు.
ఎంఎల్ఆర్ఐటీ 4వ సంవత్సరం విద్యార్థుల కోసం ప్రాజెక్ట్ ఎక్స్‌పోను కూడా నిర్వహించింది. 53 ప్రాజెక్టుల్లో 15 ప్రాజెక్ట్‌లు రెండవ రౌండ్‌కి షార్ట్ లిస్ట్ చేయబడ్డాయి. 1, 2, 3, కన్సోలేషన్ స్థానాలకు నాలుగు ప్రాజెక్ట్‌లు ఎంపిక చేయబడ్డాయి. జాబ్ ఇంటర్న్‌గా ఐడీఎస్ లో చేరడానికి ఆఫర్ ఇచ్చిన ఇద్దరు విద్యార్థులు.. డా. కె.శ్రీనివాస్ రావు – ప్రిన్సిపాల్, డాక్టర్ ఇ. అనుప్రియ – హెచ్ఓడీ-సీఎస్ఈ, అరవింద్ వోరుగంటి – వైస్ ప్రెసిడెంట్-ఐడీఎస్, సునీల్ యడవల్లి విజేతలను సత్కరించారు.
ఈ సందర్భంగా కళాశాల కార్యదర్శి తెరాస మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ… ఇదివరకు ఎంఎల్ఆర్ఐటీ పలు అంత్జాతీయ సంస్థలతో కలిసి అవగాహన ఒప్పందాలు చేసుకుందని నేడు మరొక ప్రముఖ సంస్థ ఆ జాబితాలో చేరడం సంతోష కరమని విధ్యార్థులకు, ఉపాధ్యాయులకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. ప్రాజెక్ట్ expo ను విజయవంతంగా నిర్వహించిన కంప్యూటర్ సైన్స్ డిపార్ట్ మెంట్ వారికి అయన అభినందనలు తెలిపారు.. అలాగే విజేతలైన విధ్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement