Saturday, May 11, 2024

HYD : నిత్యం ప్రజల మధ్యలో ఉండే తనకు ఓటు వేసి గెలిపించాలి-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

కర్మన్ ఘాట్, నవంబర్ 7( ప్రభ న్యూస్) ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ప్రచారాన్ని నమ్మకుండా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ అభివృద్ధి చేస్తున్న తనకు ఓటు వేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. హస్తినపురం డివిజన్ వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఈదులకంటి రాంరెడ్డి గార్డెన్స్ నందు డివిజన్ అధ్యక్షులు అందోజు సత్యం చారి అధ్యక్షతన నిర్వహించారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి,ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానం అమలు చేయడం జరిగిందని తెలిపారు. అభివృద్ధి విషయంలో ఎల్.బి.నగర్ ముందంజలో ఉంది అని,వచ్చే ఎన్నికల్లో ఎల్.బి.నగర్ నందు బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది అన్నారు నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల నందు పలు కమిటీ పదవులు ఉన్న ప్రతి ఒక్కరు నియోజకవర్గ పరిధిలోని జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గ పరిధిలో వేల కోట్ల రూపాయలతో స్కై,ఫ్లై ఓవర్లు,అండర్ పాసులు నిర్మించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసినట్టు తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గ పరిధిలో అత్యధిక పార్కులు,మరియు స్విమ్మింగ్ పూల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి అని తెలిపారు. జీ.ఓ 11 ద్వారా పండ్ల మార్కెట్ ను కోహెడకు తరలించి ఆ ప్రాంతంలో టీమ్స్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది అని తెలిపారు. 118 జీ.ఓ.ద్వారా 18 వేల కుటుంబాలకు లబ్ది చేకూర్చడం జరిగింది అని తెలిపారు. చెరువుల సుందరికారణ చేయడం జరిగిందని తెలిపారు.ఆటో నగర్ డంపింగ్ యార్డు స్థలం కోర్టు కేసు ఉండడం వల్ల ఆలస్యం జరిగింది అని తెలిపారు.కొన్ని రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అయి తిరిగి పనులు ప్రారంభం అవుతాయి అని తెలిపారు. కాలనీ వాసులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ యొక్క కాలనీల యందు దాదాపు అన్ని పనులు చేయించడం జరిగింది అని గుర్తు చేశారు.ఇంకా కొన్ని,కొన్ని కాలనీల యందు కొన్ని సమస్యలు ఉన్నాయని గుర్తు చేశారు.హస్తినపురం నందు రిజిస్ట్రేషన్ సమస్యల వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నేను చొరవ తీసుకుని రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. ఎస్.ఎన్.డి.పీ.పనుల వల్ల ఇప్పుడు మనం ప్రతిఫలం అనుభవిస్తున్నాము అని తెలిపారు.ఎస్.ఎన్.డి.పీ.మరియు ఎస్.ఆర్.డి.పీ.పనులు వేగవంతం చేసి,ఎంత పెద్ద భారీ వర్షం వచ్చిన ఇండ్లు మునగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది అని తెలిపారు.ఇంకా కొన్నిచోట్ల చిన్న,చిన్న సమస్యలు ఉన్నాయి వాటిని కూడా దశలవారీగా పరిష్కారం చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో బి.ఎన్.రెడ్డినగర్,చంపాపేట్,నాగోల్ నందు ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని తెలిపారు. ఇప్పటికే అట్టి ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇప్పుడు నియోజకవర్గం మీద ఏమి అవగాహన లేని కొత్త,కొత్త నాయకులు రాజకీయ లబ్ది పొందాలని కొత్త కొత్త వరసలు కలుపుకుంటు వస్తూ వచ్చి మేము అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు.ఏ గల్లీ ఎక్కడ ఉందో తెలియని నాయకులను నమ్మవద్దని తెలిపారు.నియోజకవర్గం మీద అవగాహన లేని వ్యక్తి ఏమి అభివృద్ధి చేస్తాడని అన్నారు.మా ఊరు,మా ఊరు అంటూ కొత్త వరసలు కలుపుతున్నావు కదా.మళ్ళీ వరదలు,కరోన సమయంలో ఎక్కడికి పోయావు అని విమర్శించారు. నన్ను ఎప్పుడు పిలిచిన నేను పలుకుత.మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి,నియోజకవర్గ అభివృద్ధికి మీ యొక్క సహాయ సహకారాలు అందించలని కోరారు. ఎంపీగా రేవంత్ రెడ్డి ని గెలిపిస్తే ఏనాడైనా నియోజకవర్గాన్ని పట్టించుకున్నారా ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడారా అని అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పద్మ శ్రీనివాస్ నాయక్,సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్ రెడ్డి,డివిజన్ బారాస పార్టీ అధ్యక్షులు సత్యం చారి,కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్త శ్రీనివాస్ యాదవ్ మరియు పలు కాలనీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement