Sunday, April 28, 2024

ప్లైఓవ‌ర్ డౌన్ ర్యాంప్ ను ప్రారంభించిన మంత్రి త‌ల‌సాని

కార్వాన్ : కార్వాన్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధి మైత్రి ఆసుప‌త్రి ప్రాంతంలో పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రేస్ హైవే ప్లైఓవ‌ర్ బ్రిడ్జ్ పిల్లర్ నంబ‌ర్ 88 వ‌ద్ద బ్రిడ్జ్ కి అనుసంధానం చేస్తూ 9.63 కోట్ల రూపాయల వ్యయంతో నూత‌నంగా నిర్మించిన డౌన్ ర్యాంప్ ను పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంబోత్స‌వం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో గౌరవ అతిథి ప్రొటెం లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎమ్మెల్సీ, అమీనుల్ హసన్ జాఫ్రి,హోం, జైళ్లు, అగ్నిమాపక సేవల మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, జీహేచ్ఎంసీ మేయ‌ర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, జీహేచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మాతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్వాన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్, త‌దిత‌రులు పాల్గోన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement