Thursday, May 2, 2024

ప్రఖ్యాత మూన్ మ్యాన్ డాక్టర్ మైల్‌స్వామి అన్నాదురై తో ఖుల్ కే సమావేశం

హైదరాబాద్ : చంద్రయాన్-3 రహస్యాలను వెల్లడించడం కోసం ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ మైల్‌స్వామి అన్నాదురైతో ఖుల్ కే రౌండ్‌టేబుల్‌ను నిర్వహించారు. అర్థవంతమైన సంభాషణలను పెంపొందించడానికి అంకితమైన వినూత్న సోషల్ నెట్‌వర్కింగ్ యాప్, ఖుల్ కే, బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ మాజీ డైరెక్టర్, భారతదేశపు ప్రఖ్యాత మూన్ మ్యాన్ డాక్టర్ మైల్‌స్వామి అన్నాదురై చేత రౌండ్‌టేబుల్ ను నిర్వహించింది. ఖుల్ కే రౌండ్ టేబుల్ సెషన్ ద్వారా వినియోగదారులు డాక్టర్ అన్నాదురైతో నేరుగా మాట్లాడటానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందించింది. రాబోయే చంద్రయాన్-3 మిషన్‌తో పాటుగా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లో అమర్చడానికి ఉద్దేశించిన పరిశోధనా పరికరాలను గురించి కూడా వెల్లడించారు.

చంద్రయాన్ మిషన్ 1 నుండి 2, 3 వరకు అభివృద్ధి చేయబడిందని అన్నాదురై తెలిపారు. చంద్రయాన్ -2 మిషన్ సమయంలో విక్రమ్ ల్యాండర్ ఎదుర్కొన్న సవాళ్లపై కూడా ఆయన మాట్లాడారు. పూర్తిగా పరీక్షించాల్సిన సరళమైన వ్యవస్థను కలిగి ఉండాలన్న ఆయన, చివరి లెగ్ చాలా వేగంగా ఉంటుంది, కానీ దానికి వివరణాత్మక ప్రణాళిక అవసరమన్నారు. ఈసారి చంద్రయాన్ 3 లో ఎలాంటి లోపాలు లేకుండా శ్రద్ధ పెట్టబడిందని భావిస్తున్నానని ఆయన చెప్పారు. చంద్రుని దక్షిణ ధ్రువాన్ని అన్వేషించడం విశేషమైన ప్రాముఖ్యత గురించి కూడా ఆయన వెల్లడించారు. ప్రభావవంతమైన వ్యక్తులతో వినియోగదారులను కనెక్ట్ చేయడం ద్వారా, తగిన పరిజ్ఞానం అందించడం ద్వారా, అర్థవంతమైన చర్చలలో పాల్గొనడానికి అవకాశాన్ని ఖుల్ కే అందిస్తుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement