Thursday, April 18, 2024

జూబ్లీహిల్స్ ప‌బ్ రేప్ కేసు నిందితులకు కఠిన శిక్ష ప‌డాల్సిందే… కానీ… సోనుసూద్

జూబ్లీహిల్స్ ప‌బ్ రేప్ కేసు నిందితుల‌కు కఠిన శిక్ష ప‌డాల్సిందేన‌ని.. అయితే ఇలాంటి నేరాల‌కు ప‌బ్ లు కార‌ణ‌మ‌వుతున్నాయ‌న‌డం స‌రైంది కాద‌ని సినీన‌టుడు సోనుసూద్ అన్నారు. ఎంతో మందికి ఎన్నో విధాలుగా సాయం చేసిన సినీ నటుడు సోనుసూద్ రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా ఎందరికో సాయాన్ని అందించి మన్ననలు పొందారు. తాజాగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్ రేప్ కేసుపై సోనూసూద్ స్పందించారు.

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగందనే విషయాన్ని న్యూస్ లో చూసి షాక్ కు గురయ్యానన్నారు. ఇలాంటి నేరాలకు పబ్ లు కారణమవుతున్నాయని అనడం సరైంది కాదని సోనుసూద్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. మనం ఆలోచించే విధానంలోనే మార్పు రావాలన్నారు. మహిళలు పొట్టి బట్టలు వేసుకున్నారని విమర్శిస్తున్నారని… మనం ఆలోచించే విధానం సరిగా లేనప్పుడు మనకు తప్పుడు ఆలోచనలే వస్తాయని చెప్పారు. ఇది చాలా పెద్ద నేరమని అన్నారు. అత్యాచారానికి పాల్పడింది మేజర్లా లేక మైనర్లా అనేది ముఖ్యం కాదని… వారు ఎలాంటి నేరం చేశారనేదే ముఖ్యమని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement