Friday, April 26, 2024

Breaking: నాగోల్ కాల్పుల కేసులో.. కీలక సూత్రధారి మహేంద్ర అరెస్ట్..

నాగోల్ లోని జ్యువెలరీ షాపు కాల్పుల కేసులో కీలక సూత్రధారి మహేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. దోపిడీకి ప్లాన్ చేసిన వ్యక్తి గజ్వేల్ కు చెందిన మహేంద్ర. నెల క్రితమే నగల దుకాణంలో చోరీ కోసం మహేంద్ర రెక్కీ నిర్వహించాడు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి దోపిడీకి పాల్పడ్డాడు. గజ్వేల్ లోని ఇంట్లో మహేంద్ర బంగారాన్ని దాచాడు. మహేంద్ర ఇంట్లో కిలోన్నరకు పైగా బంగారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement