Tuesday, March 26, 2024

కంటైన‌ర్ ని ఢీ కొన్న ఆటో.. ఆరుగురు మృతి.. ఐదుగురి ప‌రిస్థితి విష‌మం

కంటైన‌ర్ ని ఆటో ఢీ కొంది.ఈ ప్ర‌మాదంలో ఆటోలో ప్ర‌యాణిస్తున్న ఆరుగురు అక్క‌డిక్క‌డే మృతి చెందారు. కాగా మ‌రో తొమ్మ‌ది మంది గాయ‌ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న తమిళనాడులోని చెంగల్పట్టులో ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున చెంగల్పట్టు జిల్లా మధురాంతకం వద్ద తిరుచ్చి-చెన్నై జాతీయ రహదారిపై కంటైనర్‌ను ఆటో ఢీకొన్న ఢీకొట్టింది.ఈ ప్రమాదం ధాటికి ఆటో పూర్తి ధ్వంసమయింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతులంతా చెన్నై నగరానికి చెందినవారుగా గుర్తించారు. తిరువన్నామళైలో కార్తిక దీప ఉత్సవంలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement