Sunday, May 19, 2024

HYD | కన్నులపండువగా రామజ్యోతి దీపోత్సవం

మణికొండ : ప్రతి ఇంటా రామజపం ప్రతి దేవాలయంలో శ్రీరాముని కీర్తనలు, భజనలతో రోజంతా పండుగలా మారింది వాతావరణం. శ్రీరామనవమి ముందే వచ్చిందా అన్నట్లు వాడవాడలోని దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి రామనామ సంకీర్తనాలతో మారుమ్రోగిపోయాయి. అయోధ్యలోని బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని స్థానిక పంచవటి కాలనీలోని కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన తెర మీద అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు.ఉదయం నుండే ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారుని దర్శించుకున్నారు.

దీపోత్సవం

సాయంత్రం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన రామజ్యోతి దీపోత్సవం కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆలయంలో దీపాలు వెలిగించి రామ నామ భజనలు చేశారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో చిన్నారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగ కుండ ఆలయ కమిటీ వారు తగు ఏర్పాట్లు చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement