Tuesday, May 7, 2024

క‌రోనా రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న గుత్తా, పోచారం…

హైద‌రాబాద్ : తెలంగాణ శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి లు క‌రోనా వ్యాక్సిన్ రెండో డోస్ ను వేయించుకున్నారు.. నిమ్స్ లో వారిద్ద‌రికి వైద్యులు వ్యాక్సిన్ వేశారు.. వారితో పాటు స్పీక‌ర్, చైర్మ‌న్ల స‌తీమ‌ణులు పుష్ప‌, అరుంధ‌తి కూడా టీకా తీసుకున్నారు. మార్చి 3వ తేదీన వీరు మొద‌టి డోసు తీసుకున్నారు. టీకా తీసుకున్న అనంత‌రం స్పీక‌ర్ పోచారం మీడియాతో మాట్లాడుతూ.. క‌రోనా టీకా విష‌యంలో ఎవ‌రూ అపోహ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప్ర‌తి ఒక్క‌రూ టీకా తీసుకోవాల‌ని కోరారు. తాను మొద‌టి డోసు తీసుకున్న త‌ర్వాత ఎలాంటి దుష్ర్ప‌భావాలు సంభ‌వించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ర్ట ప్ర‌భుత్వ నియ‌మ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా 45 సంవత్స‌రాలు నిండిన ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని పిలుపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement