Saturday, April 20, 2024

గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ నిర్వహించిన పియాజియో ఇండియా

ఇటాలియన్‌ పియాజియో గ్రూప్‌, ప్రతిష్టాత్మక వెస్పా, ఏప్రిలియా శ్రేణి స్కూటర్ల తయారీదారుకు 100శాతం అనుబంధ సంస్థ పియాజియో ఇండియా రోడ్డు భద్రత పట్ల అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లోని తమ వినియోగదారులకు గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ ను నిర్వహించింది. దాదాపు 300 మంది రైడర్లు ఈ రైడ్‌లో పాల్గొనగా, వీరిలో 100మందికి పైగా మహిళా రైడర్లు కూడా ఉన్నారు. ఈ రైడ్‌ హైదరాబాద్‌లోని అన్ని పియాజియో షోరూమ్‌ల వద్ద ప్రారంభమై, వెస్లీ కాలేజీ వద్ద కలిసింది. అక్కడ నుంచి గ్రాండ్‌ దక్కన్‌ రైడ్‌ అధికారికంగా ప్రారంభమై, హైదరాబాద్‌లోని పలు ముఖ్యమైన ప్రాంతాలు, కూడళ్ల ద్వారా దాదాపు 200 కిలోమీటర్లు తిరిగి చివరకు సోమాజీగూడాలోరి పార్క్‌ హోటల్‌ వద్ద ముగిసింది.

రోడ్డుభద్రత అవగాహన కల్పించడంలో అత్యంత చురుగ్గా వ్యవహరించే షైన్‌ ఎన్‌జీవో సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంది. హైదరాబాద్‌లోని పియాజియో డీలర్లు 50కు పైగా హెల్మెట్‌లను హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పొలీస్‌ కు అందజేశారు. వీటిని ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో జోనల్‌ బిజినెస్‌ హెడ్‌ 2–వీలర్‌ బిజు సుకుమరన్‌, రీజనల్‌ బిజినెస్‌ మేనేజర్‌ క్రాంతి కుమార్‌, డీలర్‌ పార్టనర్స్‌, షైన్‌ ఎన్‌జీవో ఫౌండర్‌ సీహెచ్‌ పరమేశ్వరి, షైన్‌ సీఈఓ సీహెచ్‌ మధుసూదన్‌ గౌడ్‌, ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ రాజేంద్ర పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement