Sunday, April 28, 2024

బూస్టర్ డోస్ తీసుకున్న గవర్నర్ తమిళిసై

రోజురోజుకూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో కేంద్రం ఇటీవలే అందరికీ బూస్టర్ డోస్ ను ఉచితంగా ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై కూడా అమీర్ పేట ప్రభుత్వ ఆసుపత్రిలో బూస్టర్ డోస్ తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 75 రోజుల పాటు బూస్టర్ డోస్ క్యాంపెయిన్ పెట్టినందుకు ప్రధానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కృతజ్ఞతలు తెలిపారు. కేసులు పెరుగుతున్నందున్న అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. రెండవ డోసు తీసుకోని వాళ్లు కూడా తీసుకోవాలని చెప్పారు. ముందే వర్షాకాలం… జ్వరాలు, వాటర్ బాండ్ డిసీజ్ లు ఎక్కువ వస్తుంటాయన్న గవర్నర్… వాక్సిన్ తీసుకుంటే.. ప్రొటెక్షన్ ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement