Monday, May 6, 2024

తెలంగాణాలో పెట్టుబ‌డులు పెట్టండి..ఈస్తోనియా అంబాసిడర్ కి సోమేష్ కుమార్ పిలుపు

హైదరాబాద్: ఈస్తోనియా అంబాసిడర్ కేత్రిన్ కివీ, డిప్యూటి చీఫ్ ఆఫ్ మిషన్ జూయ్ హియో బి.ఆర్.కె.ఆర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను నేడు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోమేష్ కుమార్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్నపలు సంస్కరణలను ఈస్తోనియా డెలిగేట్స్ కు వివరించారు. అందులో భాగంగా చేపట్టిన ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ , ఇ-గవర్నెన్స్ , సైబర్ సెక్యూరిటీ, అభివృద్ది ,సంక్షేమ పథకాల గురించి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కల్పించిన అవకాశాలను ఉపయోగించుకుని, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఈస్తోనియా డెలిగేట్స్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచించారు. ఈ కార్యక్రమంలో ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రోటోకాల్ జాయింట్ సెక్రటరి అర్విందర్ సింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement