Sunday, April 28, 2024

రైస్‌ కెర్నల్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన డీఎస్‌ఎం

ఆరోగ్య, పౌష్టికాహారంలో అంతర్జాతీయంగా లక్ష్యిత, శాస్త్ర ఆధారిత సంస్థ రాయల్‌ డీఎస్‌ఎం, నూతన ఫోర్టిఫైడ్‌ రైస్‌ కెర్నల్‌ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌ వద్ద ప్రారంభించింది. దేశవ్యాప్తంగా, విస్తృత శ్రేణిలో ఈ ప్రాంత వాసుల పౌష్టికాహార అవసరాలను తీర్చేందుకు తగిన మద్దతును ఈ కేంద్రం ద్వారా అందించనుంది. ఈసంద‌ర్భంగా డీఎస్‌ఎం హెల్త్‌ న్యూట్రిషన్‌ అండ్‌ కేర్‌ డైరెక్టర్‌–సౌత్‌ ఆసియా ఆనంద్‌ దివాన్జీ మాట్లాడుతూ… ఆహార పోషక నాణ్యత మెరుగు పరచడంలో డీఎస్‌ఎం ప్రపంచ ప్రసిద్ధి చెందిన నైపుణ్యాన్నితీసుకురావడం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు.

ఇది ఎంతోమంది ప్రజల ఆరోగ్యంపై అసాధారణ ప్రభావాన్ని చూపుతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఆదాయ వర్గాల ప్రజల్లోనూ దాగిన ఆకలి సవాళ్లను పరిష్కరించడంలో త‌మ కంపెనీ నిబద్ధతకు అనుగుణంగా ఇది ఉంటుందన్నారు. భారత ప్రభుత్వ ఆరోగ్య లక్ష్యాలకు మద్దతునూ అందిస్తుందన్నారు. ఈ ఉత్పత్తి సౌకర్యం భవిష్యత్‌లో నాణ్యమైన ఫోర్టిఫికేషన్‌ పద్ధతుల కోసం నూతన ప్రమాణాలను ఏర్పరచగలదని తాము ఆశిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement