Sunday, April 28, 2024

HYD: గ్రీన్ పార్క్ కాలనీలో డ్రైనేజ్ సమస్య పరిష్కరిస్తా.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

కర్మన్ ఘాట్, ఆగస్టు 24 (ప్రభ న్యూస్): గ్రీన్ పార్క్ కాలనీలో నెలకొన్న డ్రైనేజ్ సమస్యను త్వరలో పరిష్కరించనున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొంగర జగన్ రెడ్డి దేవాలయ చైర్మన్ వి.బాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని గురువారం క్యాంపు కార్యాలయంలో కలిసి గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 5, 8, 9 ప్రధాన రోడ్లలో సింగరేణి కాలనీ గుడిసెల నుండి వచ్చే డ్రైనేజీ నీరు రోడ్లపై వచ్చి అనేక ఇబ్బందులకు గురిచేస్తుందని వెంటనే ఆ సమస్యను పరిష్కరించడానికి ఒక ఫీట్ డ్రైనేజీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించారు.

స్పందించిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అందజేయాలని ఆదేశించారని తెలిపారు. సమస్యను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ పార్క్ కాలనీలో డ్రైనేజ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement