Sunday, April 28, 2024

HYD: జీహెచ్ఎంసీ ఆఫీసు ముందు ఔట్ సోర్సింగ్ కార్మికుల ధర్నా

ఎల్బీనగర్, హయత్ నగర్, సరూర్ నగర్ సర్కిళ్ల పరిధిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలంటూ ఎల్బీనగర్ లోని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

సుమారు మూడు సర్కిళ్ల పరిధిలోని 1200మంది కార్మికులు శుక్రవారం విధులను బహిష్కరించారు. ఈనెల 18వతేదీ నుంచి జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంతా సమ్మె బాట పడుతున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఏలు శ్రీరాములు గణేష్ రెడ్డి, నవీన్, చారి స్వామి, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement