Friday, May 17, 2024

మ‌సాజ్ సెంట‌ర్ల‌లో డ‌బ్బులు డిమాండ్..ఇద్ద‌రు అరెస్ట్

విలేఖ‌ర్ల‌మ‌ని చెప్పుకుంటూ సైబ‌రాబాద్ లోని ప‌లు మసాజ్ సెంట‌ర్ల వ‌ద్ద డ‌బ్బులు డిమాండ్ చేస్తున్న ఇద్దరిని మాదాపూర్ స్పెష‌ల్ ఆప‌రేష‌న్ టీం పోలీసులు ప‌ట్టుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే ఓ దిన‌ప‌త్రిక రిపోర్ట‌ర్ కె అమ‌ర్ నాథ్ తో పాటు, జాతీయ దిన‌ప‌త్రికలో ప‌నిచేస్తాన‌ని చెప్పుకుంటూ మోదెజ‌బా మానిక్ ల‌ను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసారు. వివ‌రాల్లోకి వెళితే మియాపూర్ పోలీసుస్టేష‌న్ ప‌రిధిలోని ఓ స్పా సెంట‌ర్ లో అసాంఘీక కార్య‌క‌లాపాలు న‌డుస్తున్నాయంటూ రిపోర్ట‌ర్లు అమ‌ర్ నాథ్, మోదెజ‌బా మానిక్ లు బెదిరించారు. ఇందుకోసం ప్ర‌తి నెలా త‌మ‌కు రూ.30వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలో ప‌దివేలు తీసుకుంటుండ‌గా మాదాపూర్ ఎస్ ఓటి పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో ఇద్ద‌రిని ప‌ట్టుకుని మియాపూర్ పోలీసుల‌కు అప్ప‌గించారు. వారిపై కేసు న‌మోదు చేసుకుని, ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement