Saturday, May 4, 2024

కేసీఆర్ కు చాలా మైల్డ్ లక్షణాలు – ..ఎలాంటి ఇబ్బంది లేదు-డాక్టర్ ఎంవి రావు

హైదరాబాద్ – సీఎం కేసీఆర్ కు కరోనా మైల్డ్ లక్షణాలు ఉన్నాయనీ, దానితో ఎలాంటి ఇబ్బంది లేదనీ. కేసీఆర్ ని పర్యవేక్షిస్తున్న డాక్టర్ ఎంవి రావు. తెలిపారు కేసిఆర్ ఆరోగ్యం గురించి ఆయన మాట్లాడుతూ , “నేటి మధ్యాహ్నం నాతో పాటు ఇంకో ఇద్దరు డాక్టర్స్ వెళ్ళాం..రాపిడ్ యాంటీజేన్ టెస్ట్ చేస్తే పాజిటివ్ అని తేలింది. ఎలాంటి ప్రమాదం లేదు..జస్ట్ హోమ్ ఐసోలేషన్ సరిపోతుంది. ఇవాళ రాత్రి కూడా ఒక డాక్టర్ పర్యవేక్షణ లో ఉంటారు..ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది..భయపడాల్సిన అవసరం లేదు..ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే ఆస్పత్రికి తరలిస్తాం.ఆ అవసరం లేదు కూడా..ప్రస్తుతం సీఎం ఫార్మ్ హౌస్ లోనే ఉన్నారు..విశ్రాంతి తీసుకుంటున్నారు..తన తో ఉన్న సిబ్బందికి టెస్టులు చేసాం వాళ్ళకి నెగెటివ్ వచ్చింది..సెకండ్ వేవ్ లో చాలా మందికి వ్యాపిస్తుంది..ఎక్కడ అటాక్ అయ్యింది అనేది చెప్పలేం”.. అని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement