Friday, May 3, 2024

నిరుపేదలకు వరం సిఎం సహాయ నిధి..

జవహార్ నగర్ : నిరుపేదలకు వరం సిఎం సహాయ నిధి అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బొయిన్‌పల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను జవహర్ నగర్ మున్సిపల్‌ కార్పోరేషన్‌ 6వ డివిజన్‌ కార్పోరేటర్ పల్లపు రవి ఆధ్వర్యంలో పాత గబ్బిలాల పేటకు చెందిన లక్ష్మీ, నరేష్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంగా నిలుస్తుందన్నారు. ఆరోగ్య శ్రీ పరిధిలోనికి రాని వైద్య చికిత్సలు చేయించుకున్న వారి ఇబ్బందులను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అండగా నిలుస్తుందని అన్నారు. ఈ ఆర్థిక సహాయం ద్వారా పేద ప్రజల ఇబ్బందులు దూరం అవుతాయని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ది సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని కొనియడారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు, యువజన సంఘం నాయకులు, మహిళలు, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement