Friday, May 17, 2024

అన్ని హంగులతో క్యాంపు కార్యాలయం..

మోండా : ప్రజా సమస్యల పరిష్కార వేదికగా క్యాంపు కార్యాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తున్నామని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు అన్నారు. క్యాంపుకార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఆధునిక లైటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాంపు కార్యాలయం ద్వారా ప్రత్యక్ష పాలన జరిగేలా ముదు చూపుతో భవన నిర్మాణం సాగుతుందన్నారు. ఎవ్వరికి ఏసమస్య వచ్చినా ఇక్కడికి వచ్చి విన్న వించుకోవచ్చని, సమస్య స్థితిగతుల ఆధారంగా సత్వర పరిష్కారం లభించేలా చూస్తామన్నారు. ఈకార్యక్రమంలో సెట్విన్‌ ఎండీ వేణుగోపాల్‌, ఉస్మానియి ఆస్పత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement