Tuesday, May 7, 2024

TS: కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ జగదీశ్వర్ గౌడ్

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర నేతలు కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి రేవంత్ ఆహ్వానించారు. పలువురు బీఆర్ఎస్ నేతలు పార్టీని విడిచిపెడుతున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు షాకిచ్చారు కార్పొరేటర్లు. బీఆర్ఎస్ కు మాదాపూర్, హఫీజ్​పేట డివిజన్ల కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజిత దంపతులు సోమవారం రాజీనామా చేశారు.

ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగదీశ్వర్​గౌడ్​, పూజిత దంపతులు ఇవాళ జూబ్లీహిల్స్​పెద్దమ్మ గుడిలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి పూజలు చేస్తారు. ఆ తర్వాత భారీ ర్యాలీగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్​లో చేరారు. జగదీశ్వర్ గౌడ్ కొంతకాలంగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే టికెట్​కోసం ప్రయత్నాలు చేశారు. అయితే బీఆర్ఎస్ అధిష్ఠానం మళ్లీ సిట్టింగ్​ ఎమ్మెల్యేకే బీఆర్ఎస్ టికెట్​ ఇవ్వడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటించిన నాటి నుంచి జగదీశ్వర్ గౌడ్ టికెట్ కోసం బీఆర్ఎస్ పెద్దలను కలిసే ప్రయత్నం చేశారు. తాజాగా బీఆర్ఎస్ అరెకపూడి గాంధీకి బీఫామ్ అందించడంతో జగదీశ్వర్ గౌడ్ పార్టీని వీడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement