Saturday, May 18, 2024

కాంగ్రెస్ భరోసా యాత్ర కు బ్రహ్మరథం… పరమేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భరోసా యాత్రకు ప్రజల్లో నుంచి మంచి స్పందన లభిస్తుందని ఆ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకానికి మారుపేరు. ప్రజల్లో మరింత నమ్మకాన్ని పెంపొందించడం, వారి భవిష్యత్ కు భరోసాను నింపేందుకే ఈ యాత్ర చేస్తున్నట్టుగా పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. భరోసా యాత్రకు ఉప్పల్ నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే.. అది చూసి ఓర్వలేక ఎమ్మెల్యే డ్రామా యాత్ర చేపట్టారని, ఈ డ్రామాలు జనం గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు. నాలున్నరేళ్లు నియోజకవర్గంలో ప్రజా సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యేకు ఇప్పుడు ప్రజలు గుర్తు వచ్చారా అంటూ నిలదీశారు.

రానున్న ఎన్నికలలో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. హబ్సిగూడ డివిజన్ అధ్యక్షుడు కాలేరు జైనవీన్ ఆధ్వర్యంలో చేపట్టిన కాంగ్రెస్ భరోసా యాత్రకు పరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గాంధీ గిరిజన బస్తీ, తదితర ప్రాంతాలలో భరోసా యాత్ర సాగింది. గిరిజనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీలతో మోసం చేస్తున్నాయన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు, రిజర్వేషన్లు పెంపు అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి, వృద్దులకు, ఇతర అన్ని రకాల పింఛను దారులకు నెలకు రూ.4వేల చొప్పున పింఛను, స్వయం ఉపాధికి మహిళలకు, యువకులకు రూ.10 లక్షల చొప్పున ఆర్ధిక సాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement