Friday, May 3, 2024

Mantralayam: మైనర్ బాలికపై అత్యాచారం..హత్య

కర్నూలు జిల్లా (మంత్రాలయం) : మంత్రాలయం మండల పరిధిలోని కర్నాటక, ఏపీ సరిహద్దులో దారుణం చోటుచేసుకుంది. 13ఏళ్ల బాలికపై ముగ్గురు అత్యాచారం చేసి, హత్య చేసిన సంఘటన శుక్రవారం వెలుగుచూసింది. మంత్రాలయంలో 13ఏళ్ల మైనర్ యువతి తల్లిదండ్రులతో కలిసి గ్రామాల్లో తిరుగుతూ చిల్లర వస్తువులు అమ్ముతుంటుంది. గురువారం త్వరగా ఇంటికి వచ్చిన బాలికను ఇంటి పక్కనున్న ముగ్గురు మాయమాటలు చెప్పి సామూహిక అత్యాచారం చేసినట్లు సమాచారం.

అనంతరం ఈ విషయం బయటకు వస్తే చిక్కుల్లో పడాల్సి వస్తుందని బాలిక చున్నీతో చెట్టుకు ఉరివేసి హత్య చేశారు. అనంతరం ఈ సంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించారు. అయితే ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement