Thursday, May 2, 2024

HYD: నిజాలను నిర్భయంగా రాసి ప్రజలకు అందించేది ఆంధ్రప్రభ.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్, జనవరి 8 (ప్రభ న్యూస్) అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను వెలుగు తీయడంలో ఆంధ్రప్రభ దినపత్రిక ముందుంటుందని మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం సరూర్ నగర్ మండల కార్యాలయం ఆవరణంలో ఆంధ్రప్రభ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ లు యెగ్గె మల్లేష్, దయానంద్ గుప్తా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా రెడ్డి మాట్లాడుతూ పత్రికలు ప్రజా పక్షాన ఉండి ప్రజాహితం కోసం పనిచేయాలన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండి పనిచేయాలని తెలిపారు. ఆంధ్రప్రభ పత్రిక సుధీర్గకాలం నుంచి పనిచేస్తున్నదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ జఠావత్ శ్రీనివాస్ నాయక్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ గౌరవ అధ్యక్షుడు దిండు భూపేష్ గౌడ్, మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కామెడీ రామ్ రెడ్డి, మాజీ ఎంపీపీ జిల్లెల్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సిరిపుర్ బాలరాజ్, కొండల్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం ఆంధ్రప్రభ ఇంచార్జ్ ప్రమోద్ కుమార్, జల్పల్లి రిపోర్టర్ ముత్తయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement