Monday, May 6, 2024

HYD: ధనుకా గ్రూప్ చైర్మన్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన అమిటీ యూనివర్సిటీ

హైద‌రాబాద్ : భారతీయ రైతు సమాజానికి చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ధనుకా గ్రూప్ చైర్మన్ శ్రీరామ్ గోపాల్ అగర్వాల్‌ను నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైన గౌరవ డాక్టరేట్ (హానరీస్ కాసా)తో సత్కరించింది. ఈ ప్రశంసలు భారతీయ వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్తును రూపొందించడంలో అగర్వాల్ కీలక పాత్రను నొక్కిచెబుతాయి. ధనుక గ్రూప్ చైర్మన్‌కు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (డి.ఫిల్.) (హానోరిస్ కాసా) ప్రదానం చేయాలని అమిటీ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సిఫార్సు చేసింది. అతని లోతైన నిబద్ధత, దృఢ విశ్వాసం, దాతృత్వ కార్యకలాపాలు వ్యవసాయాన్ని గౌరవప్రదమైన వృత్తిగా మార్చాలనే అతని నిరంతర తపన వంటివి ఈ పురస్కారానికి ఆయనను సిఫార్సు చేసేలా చేశాయి.

నోయిడాలోని అమిటీ యూనివర్శిటీలో నిర్వహించిన వేడుకల్లో ఆర్.జి.అగర్వాల్ విశ్వవిద్యాలయం అత్యున్నత గౌరవం – గౌరవ డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీ (ఆనరిస్ కాసా) ను అందుకున్నారు. భారతీయ వ్యవసాయానికి అగర్వాల్ చేసిన విశిష్ట సేవలను గుర్తించిన వైస్ ఛాన్సలర్ డాక్టర్ బల్వీందర్ శుక్లా, విశిష్ట నిపుణులు, గౌరవనీయ విద్యావేత్తలు, ఔత్సాహిక విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో సహా 2000మందితో కూడిన మహోన్నత సమావేశంలో అగర్వాల్‌కు డిగ్రీని అందజేశారు. విశ్వవిద్యాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ అశోక్ చౌహాన్, ఛాన్సలర్ డాక్టర్ అతుల్ చౌహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమిటీ యూనివర్సిటీ ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్, మొత్తం ఎగ్జిక్యూటివ్ కమిటీకి తన హృదయపూర్వక కృతజ్ఞతలను ఆర్.జి.అగర్వాల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement