Friday, May 17, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన న‌టుడు అమిత్ తివారి

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో సినీ నటుడు అమిత్ తివారి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అమిత్ తివారి మాట్లాడుతూ… ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమమ‌ని కొనియాడారు. ఇంత మంచి కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మొక్కలు నాటడం గర్వంగా ఉందన్నారు. మనకు మంచి ఆక్సిజన్ లభించాలంటే పర్యావ‌రణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ కి అమిత్ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం తన స్నేహితులు కాలకేయ ప్రభాకర్, కిరీటి దామరాజు, రాఘవ ముగ్గురికి అమిత్ తివారి గ్రీన్ఇండియా ఛాలెంజ్ విసిరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement