Friday, May 17, 2024

పోలీసుల భద్రత మధ్య.. సంబురంగా బోనాలు

ఓల్డ్ మల్కాజిగిరి మహంకాళి అమ్మవారి గుడి, సఫీల్ గూడ కట్టమైసమ్మ గుడినీ కమిషనర్ చౌహాన్ సందర్శించారు.
ఇవ్వాల, రేపు జరిగే బోనాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు కాబట్టి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. మహిళా భక్తులు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ఆవరణలో వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయడానికి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. షీ టీం బృందాలు కూడా మహిళా భక్తుల రక్షణ కోసం విధుల్లో ఉంటారని సీపీ పేర్కొన్నారు. భక్తులు పోలీసు వారికి సహకరించాలని, సంతోషంగా బోనాల పండుగ జరుపుకోవాలని ఆకాక్షించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement