Friday, May 17, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన న‌టుడు త‌నీష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో సినీ నటుడు తనీష్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తనీష్ మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో గ్రీనరి పెంచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. తనను అభిమానించే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తనీష్ పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement