Friday, May 10, 2024

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్స‌వానికి భారీగా త‌ర‌లివెళ్లిన కార్య‌క‌ర్త‌లు

నార్సింగి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు 5వ వార్డు నుంచి భారీ ఎత్తున కౌన్సిలర్ జి.శివారెడ్డి నేతృత్వంలో బ‌య‌ల్దేరి వెళ్లారు. గండిపేట మండల బీఆర్ ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం నార్సింగిలో నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి నార్సింగి మున్సిపాలిటీ 5వ వార్డు నుండి కౌన్సిలర్ జి.శివారెడ్డి నేతృత్వంలో సుమారు 250 మంది కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ.. ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవాలన్నారు. కేసీఆర్ నేతృత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని శివారెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement