Wednesday, May 1, 2024

బిల్డింగ్ పై నుంచి పడి కార్మికుడు మృతి

పేట్ బషీరాబాద్: బిల్డింగ్ పై నుంచి ప‌డి కార్మికుడు మృతి చెందిన ఘ‌ట‌న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.. బ‌తుకుదెరువు కోసం రెండు నెల‌ల క్రితం ఒరిస్సా రాష్ట్రం మల్కనగిరి జిల్లా కలిమెళ్ళ గ్రామానికి చెందిన శంకర్ (42) న‌గ‌రానికి వ‌చ్చాడు. ఐడిపిఎల్ లో స్టార్ లైట్ కన్స్ట్రక్షన్ వారు నిర్మిస్తున్న భ‌వ‌నంలో ప‌ని ప‌నిచేస్తున్నాడు. నాలుగో అంతస్తులో ఇతర కార్మికులతో కలిసి పని చేస్తున్న క్రమంలో శంకర్ అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్ర‌మాదంలో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భ‌వన నిర్మాణ కార్మికులు ఆందోళ‌న‌కు దిగారు. తోటి కార్మికుడికి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. విష‌యం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప‌రిస్థితిని సమీక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement