Thursday, May 2, 2024

అనుమానంతో భార్యను చంపిన భర్త

హైద‌రాబాద్ లోని జియాగూడలో అనుమానంతో కట్టుకున్న భార్యను హతమార్చాడు భర్త. భార్యపై అనుమానం పెంచుకున్న భ‌ర్త సంతోష్‌ గత కొంతకాలంగా భార్య స‌రిత‌తో గొడవపడుతున్నాడు. ఈ క్ర‌మంలో శుక్రవారం తెల్లవారుజామున ఆమెను కత్తితో పొడిచి హత్యచేశారు. అడ్డొచ్చిన వారిపై కూడా దాడికి దిగాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. నిందితుడు సంతోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement