Monday, May 6, 2024

‘శివయ్యకు కోటి వృక్షార్చన’ పాట‌ను ఆవిష్కరించిన ఎంపి సంతోష్ కుమార్..

హైద‌రాబాద్ : ఎంపీ సంతోష్‌కుమార్ స‌హ‌కారంతో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వ‌ర్యంలో జ‌బ‌ర్ద‌స్త్ నటుడు రాకింగ్ రాకేష్ రూపొందించిన “ఎందో నీ మాయ శివయ్యకు కోటి వృక్షార్చన” పాటను ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భం గా పాటను రూపొందించిన బృందానికి ఎంపీ అభినందనలు తెలిపారు. అనంత‌రం రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ.. మానవుడు ఏదైనా సాధించవచ్చని ఈ పాట ద్వారా తెలిపేందుకు ప్రయత్నం చేశామన్నారు. జీవితంలో చివరి ఘట్టమైన స్మశానంలో పచ్చని శివలింగం పెట్టడం జరిగిందని దీనికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకున్నామని తెలిపారు. ఈ పాటకు నటుడు, రచయిత తనికెళ్ల భరణి సలహాలు, సూచనలు అందించారు. రచయితగా కాసర్ల శ్యామ్, డైరెక్టర్‌గా సాయికుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, నటుడు ధన్‌రాజ్‌, తెలంగాణ సుజాత, సురేష్, కిషోర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement