Sunday, April 28, 2024

వేంకటేశ్వర స్వామి సేవలో ఎంపి సంతోష్ కుమార్..

హైదరాబాద్ -: జూబ్లీహిల్స్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఆలయంలో అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు, అర్చనలు, అభిషేకాలు చేశారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ సతీసమేతంగా ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు దగ్గరుండి సంతోష్‌ కుమార్‌ దంపతులతో పూజలు చేయించి స్వామివారి జ్ఞాపికతోపాటు తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని మొక్కుకున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement