Tuesday, May 21, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ ఉద్యమంలో పాల్గొనేందుకు సిద్ధం … కెటిఆర్..

హైదరాబాద్: విశాఖ స్టీల్ ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ‌కు కార్మికులు చేస్తున్న ఉద్యమానికి తెలంగాణ మంత్రి కెటిఆర్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు..హైద‌రాబాద్ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ,విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని తెలంగాణ మంత్రి పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేశారన్నారు. విశాఖ ఉక్కు కోసం చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉందన్నారు. వీలైతే వైజాగ్ వెళ్లి ఉద్యమంలో పాల్గొనేందుకు సైతం సిద్ధమని ప్రకటించారు. తమ అందరి మద్దతు విశాఖ ఉక్కు ప్రైవేటు పరం కాకూడదంటూ చేస్తున్న ఉద్యమానికి ఉంటుందని.. పోరాటంలో కలిసి ఉంటామని కేటీఆర్ వెల్లడించారు. దీంతో ఈ ఉద్యమానికి కేటీఆర్ ప్రకటన మరింత బలాన్నిచ్చినట్టైంది. ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు తెలుగు రాష్ట్రాలు ఒక్కటవ్వాల్సిన ఆవశ్యకతను కెటిఆర్ త‌న ప్ర‌క‌ట‌న ద్వారా తేట‌తెల్లం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement