Tuesday, May 14, 2024

రేపు ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్ – న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు..

హైదరాబాద్‌ : దేశానికి స్వాత్రంత్యం వ‌చ్చి 75 ఏళ్లు అవుతున్న సంద‌ర్భంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట రేపు ఒక కార్యక్రమాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ నేపథ్యంలో న‌గ‌రంలో రేపు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.. అలాగే ప‌లు మార్గాల‌లో ట్రాఫిక్ ను మ‌ళ్లిస్తున్న‌ట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ వెల్లడించారు.

ట్రాఫిక్ మ‌ళ్లింపు, ఆంక్ష‌ల వివ‌రాలు..
ఎంజే మార్కెట్‌ నుంచి మెహిదీపట్నం వెళ్లే వాహనాలను ఏక్‌మినార్‌-బజార్‌ఘాట్‌, ఆసి్‌ఫనగర్‌ల మీదుగా మళ్లిస్తారు.
నాంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి పబ్లిక్‌గార్డెన్‌ వైపు వెళ్లే వాహనాలను చాపెల్‌ రోడ్‌ టీ జంక్షన్‌- గన్‌ఫౌండ్రి, అబిడ్స్‌ వైపునకు మళ్లిస్తారు.
నిరంకారిభవన్‌, ఖైరతాబాద్‌ నుంచి రవీంద్రభారతి వైపు వెళ్లే వారిని సైఫాబాద్‌ పాత పీఎస్‌- టెలిఫోన్‌ భవన్‌- ఇక్బాల్‌మినార్‌- సచివాలయం రోడ్‌- తెలుగుతల్లి వైపునకు అనుమతిస్తారు.
హైదర్‌గూడ- కింగ్‌కోఠి వైపు నుంచి కంట్రోల్‌ రూం వైపు వెళ్లే వాహనాలను బషీర్‌బాగ్‌ జంక్షన్‌ నుంచి లిబర్టీ, తెలుగుతల్లి, ఎన్‌టీఆర్‌మార్గ్‌, ఇక్బాల్‌మినార్‌ వైపు మళ్లిస్తారు.
ట్యాంక్‌బండ్‌ నుంచి రవీంద్రభారతి వైపు వచ్చే వాహనాలను ఇక్బాల్‌ మినార్‌ నుంచి టెలిఫోన్‌ భవన్‌, లక్డీకాపూల్‌ వైపు అనుమతిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement