Wednesday, May 1, 2024

ఎమ్మెల్సీ పోలింగ్ లో ఓ విచిత్రం .. 93 మందికి ఓటు వేసిన ఓటర్

హైదరాబాద్ – తెలంగాణలో ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా 93మందికి ఓటు వేశాడు. ఈ వింత ఘటన సైదాబాద్ లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెడితే.. ఐఎస్ సదన్ డివిజన్ సుబ్రమణ్యంనగర్ కాలనీలోని పద్మావతి కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు బూత్ లోకి వెళ్లిన ఓ ఓటరు 20 నిమిషాలు గడిపారు. దీంతో క్యూ లైన్లో ఉన్న మిగతా ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు.ఓటు వేయడానికి ఇంత సేపు ఎందుకంటే బైటికి వచ్చిన వ్యక్తిని అధికారులు, ఓటర్లు ప్రశ్నించగా తాను 93మందికి ఓటు వేశానని అందుకే లేటయ్యిందని చెప్పడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement