Monday, April 29, 2024

HYD: కొత్తపేట టిమ్స్ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఎల్బీనగర్ పరిధిలోని కొత్తపేటలో టిమ్స్ ఆస్పత్రికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కొత్తపేటలో 21.36 ఎకరాల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారు. రూ.900కోట్లతో జీ ప్లస్ 14 టిమ్స్ ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నారు. ఈరోజు మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేస్తున్నారు. సనత్ నగర్ లో 17 ఎకరాల్లో రూ.882 కోట్ల వ్యయంతో జీ ప్లస్ 14 అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు. అలాగే అల్వాల్ లో 28.41 ఎకరాల్లో రూ.897కోట్ల వ్యయంతో జీ ప్లస్ 5 అంతస్తుల ఆస్పత్రుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ మూడింటికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement