Friday, May 17, 2024

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం సుమారు 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. తెలంగాణతో పాటు పక్క రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంలోని క్యూలైన్లు నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement