Thursday, May 2, 2024

TS | భారీగా నగదు పట్టివేత.. 2.36 కోట్లు స్వాధీనం: కరీంనగర్ సీపీ సుబ్బరాయుడు

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి రవాణా చేస్తున్న నగదును కరీంనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోడల్ కోడ్ అమలులో ఉన్నందున జిల్లాలో అక్రమంగా డబ్బు, మద్యం రవాణాను నిరోధించేందుకు చేపట్టిన వాహనాల తనిఖీల్లో 2. 36 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బరాయుడు మాట్లాడుతూ కరీంనగర్ పట్టణ డివిజన్ లోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ వద్ద ఇన్స్పెక్టర్ రాంచందర్ రావు వాహన తనిఖీ చేపట్టారని తనిఖీల్లో భాగంగా టి ఎస్09 యుడి 5198 వాహనం లో సరైన పూర్తి ఆధారాలు లేని 2,36,48,494 రూపాయలను సీజ్ చేసామన్నారు.

ఎన్నికల నియమావళి ప్రకారంగా స్వాధీన పరుచుకున్నామని, వెంటనే స్థానిక రిటర్నింగ్ అధికారి మరియు ఆదాయ పన్నుశాఖ వారికీ సమాచారమందించామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం రిటర్నింగ్ అధికారి సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన జిల్లా గ్రీవెన్స్ కమిటీ కి నగదును అప్పగించినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా పట్టుబడ్డ నగదు మొత్తం 2,84,67,452 రూపాయల నగదును సీజ్ చేసామన్నారు. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామన్నారు. పెద్ద మొత్తంలో నగదు పట్టుకోవడం లో కృషి చేసిన ఇన్స్పెక్టర్ రాంచందర్ రావు , ఎస్ఐ చీనా నాయక్ , హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ , జ్ఞానేశ్వర్ , కానిస్టేబుల్ రవీందర్ మల్లయ్య లను పోలీస్ కమీషనర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రిటర్నింగ్ అధికారి కె.మహేశ్వర్, ఏసీపీ టౌన్ నరేందర్ , టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె.రాంచందర్ రావు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement